Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రులు

ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎన్.డి.తివారీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

సోమవారం సాయంత్రం 6.40 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వర్ణమాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి తొలుత రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు.

ఆ తర్వాత వరుసగా శిల్పా మోహన్ రెడ్డి, డి. నాగేందర్, డి. శ్రీధర్ బాబు, డి.కె. అరుణ, మాణిక్య వరప్రసాద్, ధర్మాన ప్రసాదరావు, డి. రాజనర్సింహా, జీ. వెంకట రెడ్డి, జీ. అరుణకుమారి, గీతారెడ్డి, జే. కృష్ణారావు, కే. లక్షీనారాయణ, కే. పార్థసారథి, కే. రోశయ్య, కే. వెంకట రెడ్డి, కే. సురేఖ, ఎమ్, వెంకటరమణ, ఎమ్, అహ్మదుల్లా, ముఖేష గౌడ్, ఎన్. రఘు వీరారెడ్డి, పి. బాలరాజు, పి. లక్ష్మయ్య, పి. సుదర్శన్ రెడ్డి, పి. సుభాష్ చంద్రబోస్, పి. విశ్వరూప్, పి. రామచంద్రా రెడ్డి, పి. సత్యనారాయణ, పి. సబితా ఇంద్రా రెడ్డి, ఆర్. వెంకట రెడ్డి, ఎస్. విజయ రామరాజు, సునీతా లక్ష్మారెడ్డి, వి. వసంతకుమార్, బీ. సత్యనారాయణ, బీ. శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు.

ఇదిలావుండగా వీరిలో దామోదర్ రాజనర్శింహా, గీతారెడ్డి, పార్థసారధి, పి. రామచంద్రా రెడ్డి, ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మైనారిటీ నేత అయినప్పటికీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu