Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు

నేటి సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు
రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు సోమవారం సాయంత్రం జరగనుంది. న్యూఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ మంత్రివర్గ జాబితాకు ఆమోదం పొందారు. ఈ నేపథ్యంలో ఖరారైన పేర్లతో సోమవారం సాయంత్రం వైఎస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.

న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా తాను తయారు చేసిన మంత్రివర్గ జాబితాను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ ద్వారా సోనియాకు అందజేశారు. వైఎస్ అందజేసిన జాబితాను పరిశీలించిన సోనియా దానికి ఆమోదముద్ర వేశారు.

ఈ కార్యక్రమం పూర్తికావడంతో ముఖ్యమంత్రి వైఎస్ ఢిల్లీనుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. వైఎస్ నేతృత్వంలో సోమవారం ఏర్పాటుకానున్న మంత్రివర్గంలో 30మందికి పైగా చోటుదక్కే అవకాశం ఉందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu