Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసంద్రంలో తిరుపతి

జనసంద్రంలో తిరుపతి
మెగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా తిరుపతి జనసంద్రంలో మునిగిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జనం తిరుపతిని చేరుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి తిరుపతికి జన ప్రవాహం ఆరంభమైంది. దాదాపు 10 లక్షల మంది జనం తిరుపతిని చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి తిరుపతి శివార్లు పూర్తిగా వాహానాలతో నిండి పోయాయి.

వేలాది వాహానాలు తిరుపతిని చేరుకున్నాయి. అవిలాల చెరువులో ఇసుక వేస్తే రాలనంత జనం సభాస్థలి వద్ద గుమికూడారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. రెగ్యులర్ సర్వీసులతో పాటు, అదనపు బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు జనంతో కిటకిటలాడాయి.

తిరుపతిలోని వీధులన్నీ రాకపోకలతో రద్దీగా తయారయ్యాయి. ప్రముఖ సినీ నటుడు కావడంతో ఆయనపై అభిమానంతో చిరంజీవిని చూడడానికి పార్టీలకతీతంగా తిరుపతి చేరుకున్నారు. వీరిని నియంత్రించడానికి వీలుకాక నిర్వాహకులు నానా అగచాట్లు పడుతున్నారు. మొత్తంపై గతంలో ఎన్నడూ చూడని రీతిలో జనం తిరుపతిని చేరుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu