Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి... : మైసూరా

చిరంజీవి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి... : మైసూరా
చిరంజీవి పార్టీ విధానం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి... అన్నట్లుగా ఉందని తెలుగుదేశం నాయకుడు మైసూరా రెడ్డి విమర్శించారు. మంగళవారం రాత్రి ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన సినీ నటుడు కాబట్టి జనం తక్కువెందుకు వస్తారని ఎదురు ప్రశ్నించారు.

ఆయన చెప్పిన సమస్యలన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెపుతున్నవేనని చెప్పారు. అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పే వీరు సభ నిర్వహించిన విధానమే చెపుతుందన్నారు. సాదా సీదా జనంలో పార్టీని ఆవిర్భావింపజేసి ఉంటే ఆప్పుడు అవినీతిపై పోరాటం అనే పదానికి అర్థం ఉండేదన్నారు.

సినీ పక్కీలో సభ నిర్వహించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అవినీతిని గురించి మాట్లీడితే ఎలా అని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu