Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు జ‌గ‌న్!

ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు జ‌గ‌న్!
విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:44 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని ఏపీ సీఎం జ‌గ‌న్ దారుణంగా మార్చేశార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. తాజాగా వెలుగుచూసిన నెల్లూరు యువ‌తిపై యువ‌కుడి దాడిని కూడా లోకేష్ ప్ర‌స్తావిస్తూ, ఈ విమ‌ర్శ‌ల్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసారు.
 
ఒక్క ఛాన్స్ సీఎం ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు. జగన్ రెడ్డి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నెల్లూరు లో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోంది. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డ పై తెగబడుతున్నారు. నిందితుల్ని పట్టుకొని బెయిల్ పై అతిధి మర్యాదలతో ఇంటి వద్ద దింపడం కాదు... కఠినంగా శిక్షించాలి... అప్పుడే ఈ అరాచకాలకు బ్రేక్ పడుతుంద‌ని నారా లోకేష్ వ్యాఖ్యినించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబడ్డీ శిక్షణ తీసుకునే ఇద్దరు మైనర్లపై తండ్రీకుమారుల అత్యాచారం