Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊపందుకున్న స్థానిక స‌మ‌రం... జెడ్పీటీసీ నామినేష‌న్ల దాఖ‌లు

ఊపందుకున్న స్థానిక స‌మ‌రం... జెడ్పీటీసీ నామినేష‌న్ల దాఖ‌లు
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (17:54 IST)
ఏపీలో స్థానిక స‌మ‌రం ఊపందుకుంది. గ‌తంలో జ‌రిగిన జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఇపుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పోటాపోటీగా నామినేషన్లు దాఖ‌లు చేస్తున్నాయి. 

 
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెడన జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా దివంగత మాజీ జడ్పీటీసీ గుడిశేవ రమేష్ సతీమణి గుడిశేవ లక్ష్మీరాణి నామినేషన్ దాఖలు చేశారు. పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ తో కలిసి, పెడనలోని వైసీపీ కార్యాలయం నుండి మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి అయిన జడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావుకు త‌మ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 
తెలుగుదేశం ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా, వైసీపీదే అంతిమ విజ‌య‌మ‌ని త‌మ‌దేన‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ మొద‌లుకొని, గ్రామ‌స్థాయి ఎన్నిక‌ల వ‌ర‌కు అన్నింటిలో వైసీపీదే ఘ‌న విజ‌య‌మ‌ని, ఇదే పంథా కొన‌సాగుతోంద‌న్నారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ స‌మ్మ‌తిని ఓటు రూపంలో తెలియ‌జేస్తున్నార‌ని జోగి ర‌మేష్ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పంలో తెదేపాను నామరూపాల్లేకుండా చేయాలని వైసిపి యత్నం