Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేసీ ప్రభాకర్ ఓ ఊరకుక్క... చంద్రబాబు అన్నం తింటున్నారా... మరేమైనా తింటున్నారా?: వైకాపా నేతలు

రాజకీయాల్లో సిగ్గూశరంలేని ఏకైక వ్యక్తి తాడిపత్రి ఎమ్మెల్యే జీసీ.ప్రభాకర్ రెడ్డి అని వైకాపా నేతలు మండిపడ్డారు. ల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో సీనియర్ నేత అంబటి రాంబా

జేసీ ప్రభాకర్ ఓ ఊరకుక్క... చంద్రబాబు అన్నం తింటున్నారా... మరేమైనా తింటున్నారా?: వైకాపా నేతలు
, ఆదివారం, 5 మార్చి 2017 (17:03 IST)
రాజకీయాల్లో సిగ్గూశరంలేని ఏకైక వ్యక్తి తాడిపత్రి ఎమ్మెల్యే జీసీ.ప్రభాకర్ రెడ్డి అని వైకాపా నేతలు మండిపడ్డారు. ల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో సీనియర్ నేత అంబటి రాంబాబులు మాట్లాడుతూ జగన్‌ను అసభ్య పదజాలంతో తన ఇష్టానుసారం విమర్శిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఎం చంద్రబాబు సమర్థిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
జేసీని సమర్థిస్తున్న చంద్రబాబు అన్నం తింటున్నారా? లేక మరేమైనా తింటున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై యేడాది పాటు సస్పెన్షన్ విధించినా కక్ష తీరలేదా? అని ప్రశ్నించిన అంబటి, మరో ఐదుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోందని, అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేత ఒక్కరున్నా తమ గొంతుక వినిపిస్తామని, ప్రజా సమస్యలపై పోరాడతామని అంబటి రాంబాబు అన్నారు.
 
రాజకీయాల్లో సిగ్గూశరం లేని ఏకైక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని, ఆయన నోటిని ఫినాయిల్‌తో కడిగే సమయం వచ్చిందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బజారు మనిషిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడుతున్న భాషపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరకుక్క అని, నాడు పరిటాల రవికి భయపడి జేసీ బ్రదర్స్ పరారయ్యారని, జేసీ బ్రదర్స్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే నేరుగా జగన్‌ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ 'నేతి' మెడకు ఉచ్చు