Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు పాలన ... 'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం' : వైకాపా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అ

చంద్రబాబు పాలన ... 'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం' : వైకాపా
, శనివారం, 22 అక్టోబరు 2016 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. 
 
ఇదే హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై పోరాడితే ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని సీఎం చంద్రబాబు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పోలుస్తున్నారని మేరుగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు... ప్రభుత్వ అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. 
 
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మీరు చేస్తే తప్పు కాదు..మేం చేస్తే తప్పా..? అని ఆయన నిలదీశారు. అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేశామన్నారు. ఇప్పుడు ఆ జిల్లాను కరువు మండలాల్లో ఎందుకు ప్రకటించారని మేరుగ నాగార్జున సూటిగా ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.. మా తమ్ముడిని కాపాడండి.. కేంద్రానికి జవాను సోదరి కన్నీటి వినతి