'లవర్స్ డే' రోజు నారా లోకేశ్ రూ.కోట్ల కమిషన్ : అంబటి రాంబాబు
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్పై వైకాపా అధికార పార్టీ నేత అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. విశాఖలో బీచ్ ఫెస్టివల్కు అనుమతి ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే దాగివుందన్నారు. వచ్చే యేడాది ఫిబ
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్పై వైకాపా అధికార పార్టీ నేత అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. విశాఖలో బీచ్ ఫెస్టివల్కు అనుమతి ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే దాగివుందన్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 14వ తేదీన జరిగే లవర్స్ డే రోజున నారా లోకేశ్కు కోట్లాది రూపాయల మేరకు కమీషన్ కొట్టేయబోతున్నాడనీ ఆరోపించారు.
బీచ్ ఫెస్టివల్కు అనుమతి ఇవ్వడంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. 'బీచ్ ఫెస్టివల్' ని ముంబైకి చెందిన ఒక కంపెనీకి అప్పగించడం ద్వారా లోకేశ్ కోట్ల రూపాయల కమీషన్ అందుకోనున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు. 'బీచ్ ఫెస్టివల్' అనేది విదేశీ సంస్కృతి అని.. ఈ ఫెస్టివల్ పై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో ప్రేమజంటలు కూర్చుంటే నానా రభస చేసి.. వారిపై దాడులు చేసిన చరిత్ర బీజేపీదని.. అలాంటప్పుడు 'బీచ్ ఫెస్టివల్' ని ఏ విధంగా నిర్వహిస్తారని నిప్పులు చెరిగారు. ఈ ఫెస్టివల్ లో తొమ్మిది వేల జంటలతో డ్యాన్స్ లు చేయిస్తామని చెబుతున్నారని.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ జంటలకు తాళిబొట్లు ఇచ్చి కట్టిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.