Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం

Advertiesment
ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం
విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:35 IST)
ప్ర‌జ‌లంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో తాము ప‌రిష‌తీ్ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యాన్నిసాధించామని ముఖ్య మంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడారు. 
 
ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని సీఎం తెలిపారు. పరిషత్‌ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 81 శాతం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 99 శాతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారని తెలిపారు.
 
86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో మ‌ళ్ళీ మృత్యు ఘంటిక‌లు...రోజూ 2 వేల క‌రోనా మరణాలు