Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

pinnelni

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (17:50 IST)
వైకాపాకు చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదైవున్నాయి. ఈ నాలుగు కేసుల్లో ఆయన ఇప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై బయట ఉంటున్నారు. కానీ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం.. నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఈ పిటిషన్లపై జూన్ 20వ తేదీన హైకోర్టులో వాదనలు ముగియగా, బుధవారం తీర్పును వెలువరించింది. 
 
కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంలను బద్ధలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను కూడా దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటి రోజున పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే ఆయనను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)