Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత

యాడికి పోలీసులు భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత
, శనివారం, 6 నవంబరు 2021 (20:48 IST)
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు భారీగా మహరాష్ట్ర మద్యం పట్టుకున్నారు. రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

యాడికి మండలం NH 67 హైవే పై కొత్త పెండేకల్లు గ్రామం వద్ద తెలంగాణకు చెందిన బొలెరో వాహనంలో ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పామిడి రూరల్ సీఐ రవి శంకర్ రెడ్డి, ఎస్ ఐ రాంభూపాల్ మరియు సిబ్బంది కలసి స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య యాడికి పోలీసు స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
 
ఇద్దరి అరెస్టు...1,344 టెట్రా పాకెట్లు స్వాధీనం
రాయదుర్గం సెబ్ పోలీసులు & సెబ్ ప్రత్యేక బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 1,344 టెట్రా  పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇద్దరి అరెస్టు...3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం
గుత్తి సి.ఐ శ్యాంరావు ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 3.2 బంగారు, 50 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశాభివృద్దిలో విద్యదే కీలక భూమిక: ఏపీ గవర్నర్