Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంత్యక్రియలకు సిద్ధం.. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు..

అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి

అంత్యక్రియలకు సిద్ధం.. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు..
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (10:00 IST)
అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మదలింగనాడు గ్రామానికి చెందిన లింగప్ప సోమనాళు (54) హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు.
 
విజయపురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చికిత్స నిర్వహించారు. వైద్యులు లింగప్ప బతకడం సాధ్యం కాదని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 19న ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. మార్గమద్యంలో లింగప్ప శ్వాసతీసుకోకపోవడంతో మృతి చెందారని తెలిపారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే రోజు రాత్రి లింగప్ప మృతి చెందారనుకున్నారు. కానీ తెల్లవారుజామున లింగప్పసోమనాళ ఒక్కసారిగా లేచి కూర్చొన్నారు. దీంతో అందరూ పరుగులు తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్-రూ.243కి అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్