Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెక్కీ భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్య

టెక్కీ భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్య
, శుక్రవారం, 20 మే 2016 (09:01 IST)
టెక్కీ భర్తపై అనుమానంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం బూరాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన నీరుడు సుధాకర్‌ హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు అనూష  (27) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నగరానికి వచ్చి లంగర్‌హౌస్‌ జానకీనగర్‌లో నివసిస్తున్నాడు. అనూష కూడా బీటెక్‌ చదివింది. పిల్లలు చిన్నగా ఉండడంతో ఇంట్లోనే ఉంటోంది. 
 
భర్త సుధాకర్‌ అతని స్నేహితుడి చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు అనూష గుర్తించింది. ఆమె సెల్‌ఫోన్‌ రీచార్జి చేయించడంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. గురువారం ఇద్దరూ గొడవపడ్డారు. భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానం ఆమెను పెనుభూతంగా మార్చింది. 
 
అతడు ఉద్యోగానికి వెళ్లగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న సుధాకర్‌ వెంటనే ఇంటికి రాగా అప్పటికే భార్య మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచిత పథకాలు.. ప్రతిపక్షాల వైఫల్యాలే జయలలితను అందలమెక్కించాయి!