Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం.. ఇంట్లో భార్య... కోడలిని కోర్కెతీర్చమన్న మామ....

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో మామ పెట్టిన లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే...

భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం.. ఇంట్లో భార్య... కోడలిని కోర్కెతీర్చమన్న మామ....
, బుధవారం, 26 జులై 2017 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో మామ పెట్టిన లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం మొరారిపల్లి చెందిన అనుముల మల్లారెడ్డి, రాధ దంపతుల కూతురు మాధవిని సుమారు ఏడేళ్ల క్రితం జనగామ జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన అండెం సత్తిరెడ్డి, స్వరూప దంపతుల కుమారుడు నర్సిరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
కాపురం సజావుగా సాగుతుండగా సుమారు రెండు నెలల క్రితం భర్త నర్సిరెడ్డి భార్యాపిల్లలను స్వగ్రామంలోనే వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య మాధవి ఇంటి వద్దే ఉంటూ పిల్లలతో పాటు అత్తమామల బాగోగులు చూసుకుంటూ వచ్చింది.
 
ఈ క్రమంలో కోడలిపై కన్నేసిన మామ... ఆమెను కోర్కె తీర్చమని వేధిస్తూ వచ్చాడు. అలాగే, అత్త కూడా సూటిపోటి మాటలతో వేధిస్తూ వచ్చింది. అత్తామామ వేధింపులనను తాళలేక ఆ మహిళ శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మృతురాలి తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్తను చంపు, కానీ నా పిల్లాడిని వదిలిపెట్టు ఎందుకంటే...?