Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లాలో యువతిపై అత్యాచారం, హత్య

Advertiesment
woman rape and murder in chittore
, ఆదివారం, 1 మే 2016 (19:45 IST)
చిత్తూరు-కర్ణాటక సరిహద్దులో దారుణం జరిగింది. ఒక యువతిపై అత్యాచారం చేసి ఆ తరువాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. వి.కోట సమీపంలోని శీతంపల్లె వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా యువతి మృతదేహం కనిపించింది. 
 
యువతిపై అత్యాచారం చేసి దారుణంగా కొట్టి ఆ తరువాత కిరోసిన్‌ పోసి నిప్పటించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సంఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. కర్ణాటక రాష్ట్రానికి అతి సమీపం కావడంతో ఆ రాష్ట్రానికి చెందిన యువతిగానే పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడి ఛైర్మన్‌గా తిరిగి చదలవాడా...? బాబోయ్.. దండం పెడతాం... వద్దు బాబోయ్‌...