Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేశారు.. రూ.20 వేలు ఇస్తాం కేసు పెట్టొద్దొంటున్నారు.. చిత్తూరులో దారుణం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె చేతిలో 20 వేల రూపాయలు పెట్టి సర్దుకోమని సలహా ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

Advertiesment
Woman Gang Rape
, గురువారం, 26 జనవరి 2017 (10:39 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె చేతిలో 20 వేల రూపాయలు పెట్టి సర్దుకోమని సలహా ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో.. ఓ మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు కేసు కాకుండా రంగంలోకి దిగిన పెద్దలు.. రూ.20 వేలు చెల్లించి సరి పెట్టుకున్నారు. చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళపై ఈనెల 22వ తేదీన ఆ గ్రామానికి చెందిన సుధాకర్‌, వెంకటరెడ్డిలు లైంగిక దాడికి పాల్పడ్డారు. 
 
ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో దాడి చేశారు. దీనిపై బాధితురాలు బుధవారం చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో నిందితుల తరపున కొందరు రంగంలోకి దిగి అత్యా చారం.. దాడికి రూ.20 వేల పరిహారం చెల్లించమని తీర్మానించినట్లు సమాచారం. తద్వారా కేసు లేకుండా రాజీకి యత్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే పందుల పందేలు ఆడుకోండి.. సుజనా చౌదరి కామెంట్స్