Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గజ్వేల్‌లో దారుణం... మెడను వేరు చేసి.. గోనె సంచిలో మూటగట్టి...

తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి గోనె సంచిలో మూటగట్టి రోడ్డు పక్కన పడేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామ

Advertiesment
murder
, ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి గోనె సంచిలో మూటగట్టి రోడ్డు పక్కన పడేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామ శివార్లలో శనివారం ఉదయం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... అక్కారం గ్రామంలోని తోట లక్ష్మారెడ్డి వ్యవసాయ పొలం పక్కన గల కాలువలో ఒక తెల్లని గోనె సంచిలో గుర్తుతెలియని యువతి మృతదేహం ఉందని గ్రామ సర్పంచ్ రాజుకు సమాచారం అందింది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతి మృతదేహంగా గుర్తించారు. 
 
మెడ - మొండెం భాగాలను పూర్తిగా వేరు చేసి సంచిలో వేసి మూటకట్టి రోడ్డుపై పడేశారు. యువతి ఒంటిపై ఎర్రని ప్యాంట్‌ (పైజామా), ఎరుపు, నలుపు కలగలిపిన టాప్‌ (చుడిదార్‌) ఉంది. అమ్మాయి కొద్దిగా లావుగా ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మెడ వరకు తలను వేరు చేసి మొండాన్ని సంచిలో వేసి పడేసినట్లు భావిస్తున్నారు. కాగా క్లూస్‌ టీమ్‌తో ఆధారాలను సేకరించామని, జాగిలా(డాగ్‌స్క్వాడ్‌)లతో తనిఖీ చేసినట్లు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యా రక్షణ శాఖకు ఫ్లైట్ గల్లంతు... 91 మందితో విమానం అదృశ్యం