Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొడవలొద్దు.. ఇంటికిరా కలిసుందామన్నాడు.. ఫ్రెండ్స్‌తో కలిసి భార్యాబిడ్డల్ని చంపేశాడు.. ఎక్కడ?

భర్త హింస, వేధింపులు తాళలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా గొడవలొద్దు.. అర్థం చేసుకుని కలిసి ఉందామని చెప్పిన భర్తను నమ్మి ఆ భార్య ఆతని వెంట వచ్చింది. భర్తను నమ్మిన పాపానికి ఆ మహిళ ఇద్దరు చిన్

గొడవలొద్దు.. ఇంటికిరా కలిసుందామన్నాడు.. ఫ్రెండ్స్‌తో కలిసి భార్యాబిడ్డల్ని చంపేశాడు.. ఎక్కడ?
, గురువారం, 30 జూన్ 2016 (10:05 IST)
భర్త హింస, వేధింపులు తాళలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా గొడవలొద్దు.. అర్థం చేసుకుని కలిసి ఉందామని చెప్పిన భర్తను నమ్మి ఆ భార్య ఆతని వెంట వచ్చింది. భర్తను నమ్మిన పాపానికి ఆ మహిళ ఇద్దరు చిన్నారులతో పాటు తన ప్రాణాలను కోల్పోయింది. ఇంత దారుణానికి పాల్పడిన భర్త మాత్రం కేసు నుంచి తప్పించుకునేందుకు భార్యాపిల్ల మరణాలను ఆత్మహత్యగా చిత్రీకరించేలా మృతదేహాలను రైలు పట్టాలపై పడవేశాడు.
 
గుంటూరు లాలాపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నల్లచెరువు నాగలక్ష్మి(23) కి నాలుగేళ్ల క్రితం పిట్టలవానిపాలెం మండలం ఆలూరికి చెందిన వీర్ల రమేష్‌తో ప్రేమ వివాహం అయింది. వీరికి యశ్వంత్‌(3), ట్వినిష్‌(1) పిల్లలు ఉన్నారు. ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో రమేష్‌పై నాగలక్ష్మి వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.
 
ఈ నేపథ్యంలో పోలీసులు రమేష్‌కు నాలుగు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారం రోజుల క్రితం రమేష్ భార్య ఇంటికి వచ్చి ఇకపై గొడవలు లేకుండా కలిసి ఉందామని నమ్మబలికాడు. దీంతో భర్త వెంటే వచ్చిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చిరుతిళ్లు కొనిపెడతానని ముగ్గురిని తీసుకెళ్లి రమేష్ హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తన స్నేహితులతో కలిసి రమేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసు జీపును ఢీకొట్టిన ఆటో.. ఆటో డ్రైవర్‌‌పై ఖాకీల పిడిగుద్దులు...