Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా పుష్కరాలలో పాల్గొనని పవన్, జ్వరం వల్లనా లేక బాబు ఆహ్వానించలేదనా..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాలకు పవన్ వెళతాడా లేదా అన్నది హాట్ టాపిక్‌‌గా మారింది. అయితే పుష్కరాలకు రావాలంటూ సీఎం చంద్రబాబు డైరెక్టుగా పిలువలేకపోయినా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని పవన్ దగ్గరికి పంపార

కృష్ణా పుష్కరాలలో పాల్గొనని పవన్, జ్వరం వల్లనా లేక బాబు ఆహ్వానించలేదనా..?
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:12 IST)
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాలకు పవన్ వెళతాడా లేదా అన్నది హాట్ టాపిక్‌‌గా మారింది. అయితే పుష్కరాలకు రావాలంటూ సీఎం చంద్రబాబు డైరెక్టుగా పిలువలేకపోయినా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని పవన్ దగ్గరికి పంపారు. పవన్ ఇంటికెళ్లిన పల్లె జనసేనానిని ఆత్మీయంగా పలకరించి పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానించారు.
 
పవన్ జ్వరంతో ఉండటంతో పుష్కర స్నానాలకు హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో అభిమానుల్లో కాస్త అసంతృప్తి కలిగింది. అయితే సోషల్ మీడియాలో ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌ను పుష్కరాలకు  పిలువలేదనీ.. రాష్ట్రంలో జరిగే ప్రధాన కార్యక్రమాలకు పవన్ వంటి నేతను సీఎం చంద్రబాబు డైరెక్టుగా ఆహ్వానించకపోతే ఎలా? అని పుకార్లు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తే బాగుండేదని కొందరు పవన్ అభిమానులు అంటున్నారు. మరి సీఎం చంద్రబాబు ఏం చేస్తారో...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ నిర్ణయంతో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్