Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుస్తెలమ్మైనా పులస తినాలన్నది నానుడి.. రూ.వేలు పలికిన గోదారి పులస! (video)

పుస్తెలమ్మైనా పులస తినాలన్నది నానుడి.. రూ.వేలు పలికిన గోదారి పులస! (video)
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:45 IST)
పుస్తెలమ్మైనా పులస తినాలన్న నానుడి వాడుకలో ఉంది. ముఖ్యంగా గోదారి పులసకు ఉండే ప్రత్యేకత ఇంతాఇంతా కాదు. అంటే.. గోదారి పులస రుచి అలాంటిది మరి. అయితే, ఈ పులస రుచిలాగానే ధర కూడా ఉంటుంది. పులసలకు పెట్టింది పేరు... తూర్పు'గోదావరే'! 
 
జూలై - సెప్టెంబరు నెలల మధ్య వర్షాకాలంలో.. 'ఇలస' చేప.. గోదావరి జలాల్లో ఎదురీదుతూ.. 'పులస'గా మారుతుందని చెబుతారు. మత్స్యకారుల వలకు చాలా అరుదుగా పడతాయి. కిలో రూ.4 వేల వరకు ఉంటుంది. దేశంలోనే ఖరీదైన చేప అంటారు. దీని రుచి గురించి తెలిసినవారు.. ధర గురించి ఏమాత్రం ఆలోచించరు.
 
తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద గోదావరి నదిలో ఆదివారం స్థానిక మత్స్యకారుడి వలలో రెండున్నర కిలోల పులస చేప పడింది. పాశర్లపూడిలో నగరం ఏఎంసీ ఛైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఈ చేపను రూ.21 వేలుకు కొనుగోలు చేయడం విశేషం. 
 
పులస సాధారణంగా 3 కిలోలకు మించి బరువుండదు. ఎక్కువగా అరకిలో, కిలో లోపు చేపలే దొరుకుతాయి. కానీ ఈ పులస ఏకంగా రెండున్నర కిలోలు ఉండటంతో ధర కూడా ఓ రేంజ్‌లోనే పలికిందన్నమాట. అద్గదీ గోదారి పులస కథ. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో హ్యాపీగా వుండాలని వెళ్లాడు.. కానీ ఆత్మహత్య..?