Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి నో చెప్పాడనీ ప్రియుడిని కత్తితో వెన్నులో పొడిచిన ప్రియురాలు...

Advertiesment
West Godavari
, మంగళవారం, 12 జనవరి 2021 (09:13 IST)
రెండేళ్ళపాటు ప్రేమించి, తీరా పెళ్లి మాటెత్తగానే నో చెప్పిన ప్రియుడుని ప్రియురాలు కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
 
పెళ్లి చేసుకుందామంటూ పావని ఏడాదిగా అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం తాతాజీ బైక్‌పై పంగిడి వచ్చాడు. అక్కడ పావని అతడిని కలిసింది. రాత్రి వరకు ఇద్దరూ అక్కడే తిరిగిన అనంతరం బైక్‌పై మలకపల్లి బయలుదేరారు.
 
ఈ క్రమంలో వెనక కూర్చున్న పావని సంచిలో వెంట తెచ్చుకున్న కత్తి తీసి తాతాజీని వెనక నుంచి పొడిచింది. బాధతో కిందపడి విలవిల్లాడుతున్న తాతాజీ మెడ, తల, వీపుపైనా కత్తితో దాడిచేసింది. 
 
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు జాతీయ యువజన దినోత్సవం... దాని ప్రత్యేక ఏంటి?