Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తాం, నా సొంత డబ్బుతో బెడ్లు: చెవిరెడ్డి

మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తాం, నా సొంత డబ్బుతో బెడ్లు: చెవిరెడ్డి
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:16 IST)
తిరుపతి: మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 6గం నుంచి ఉదయం 10 గం వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

10 గంటల తరువాత ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. తన సొంత నగదుతో 25 లక్షలతో చంద్రగిరి నియోజకవర్గంలో 150 ఆక్సిజన్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెవిరెడ్డి తెలిపారు.

చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో 100 ఆక్సిజన్ బెడ్లు, నారావారిపల్లి పీహెచ్‌సీలో 50  ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 10 వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెవిరెడ్డి తెలిపారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 ఏళ్ల బాలికతో 58 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. చివరికి..?