Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

3 నెలల పాటు 15 ఏళ్ల బాలికపై వాలంటీర్ అత్యాచారం

rape
, మంగళవారం, 31 మే 2022 (17:21 IST)
వాలంటీర్ల వేధింపుల సంఖ్య ఏపీలో పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేసేందుకు వాలంటీర్లను నియమిస్తే వారు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా గత మూడు నెలలుగా బాలికపై ఓ వాలంటీర్‌ అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. బాలిక (15) తల్లిదండ్రులు ఉపాధి పనుల నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్నారు. బాలిక తన అమ్మమ్మతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.
 
ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త: వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్‌గా తిరుప‌తి