Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

Advertiesment
suicide

సెల్వి

, సోమవారం, 25 నవంబరు 2024 (10:23 IST)
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 22 ఏళ్ల టీచర్ తన మాజీ ప్రేమికుడి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కాగితాల రాశి అనే బాధితురాలు భీమిలి మండలం మజ్జివలస గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆమె నవంబర్ 16న ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఆ రోజు సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26)ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
భీమిలి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం రాజు, రాశి మధ్య సుమారు 11 ఏళ్లుగా సంబంధం ఉంది. రాశి తల్లిదండ్రులు వారి వివాహాన్ని వ్యతిరేకించడంతో పరిస్థితి మరింత దిగజారింది. 
 
తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు బెదిరించాడని భీమిలి ఎస్‌ఐ తెలిపారు. రాజును నవంబర్ 22న అరెస్టు చేసి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. రాజు కొన్నాళ్లుగా ప్రేమ నెపంతో ఆమెను వేధిస్తున్నాడని తెలుస్తోంది. 
 
తొలుత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కుటుంబ సభ్యులు భీమిలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)