Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాకుళంలో దారుణం - సచివాలయంలో బాలికపై వలంటీర్ అత్యాచారం

శ్రీకాకుళంలో దారుణం - సచివాలయంలో బాలికపై వలంటీర్ అత్యాచారం
, శనివారం, 6 నవంబరు 2021 (10:13 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పరిపాలన కోసం ఏర్పాటుచేసిన సచివాలయంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది వలంటీరే కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నడుకూరు గ్రామానికి చెందిన బి.హరిప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే సచివాలయంలో వలంటీరుగా పని చేస్తున్నాడు. గత నెల 31వ తేదీ తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న 12 యేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
అతడికి రాంబాబు అనే యువకుడు పూర్తి సహాయ సహకారాలు అందించాడు. లైంగికదాడి తర్వాత ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో నిందితులిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అయితే, తన చెల్లి కనిపించకపోవడంతో బాధితురాలి అక్క గ్రామంలో గాలిస్తూ సచివాలయానికి వచ్చింది. అక్కడ అపస్మారకస్థితిలోపడివున్న చెల్లిని చూసి బోరున విలపిస్తూ కేకలు వేసింది. ఆ తర్వాత దీనిపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాచెల్లెళ్ల పండుగ... భగినీ హస్త భోజనం!