Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌ని ఒత్తిడితో సచివాలయం కార్యదర్శి ఆత్మహత్య?

Advertiesment
Village Secretariat Secretary
, శనివారం, 3 జులై 2021 (20:42 IST)
జీతం 5 వేలు ప‌ని మాత్రం 12 గంట‌ల‌కు పైనే... పైగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీవీరి చేతుల‌పైనే న‌డ‌వాలి. దీనితో ప‌ని ఒత్త‌డి పెరిగి గ్రామ స‌చివాల‌యం సిబ్బంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలానే ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక ఒక స‌చివాల‌యం కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడని అతడి కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

కృష్ణా జిలా మచిలీపట్నంలోని ఎస్.ఎన్. గొల్లపాలెం సచివాలయం కార్యదర్శి మల్లంపాటి సుధాకర్ ఆత్మహత్య కు పాల్ప‌డ్డాడు. మచిలీపట్నం ఇనగుదురుపేటలో నివాసం ఉంటున్న సుధాకర్, త‌న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి వల్ల నిత్యం స‌త‌మ‌తం అయ్యేవాడ‌ని, చివ‌రికి అది భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు పేర్కొంటున్నారు.

అయితే, దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ చేస్తున్నామ‌ని పోలీసులు చెపుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రెవిన్యూ ఉద్యోగులు, స‌చివాల‌యం సిబ్బంది సుధాక‌ర్ మృతికి సంతాపం తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రిని మించిన దుర్మార్గుడు జ‌గ‌న్: మంత్రి జగదీష్ రెడ్డి