Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడపను కొడతామన్నారు... వివేకా హత్యపై అనుమానాలు... పద్మ డిమాండ్

Advertiesment
కడపను కొడతామన్నారు... వివేకా హత్యపై అనుమానాలు... పద్మ డిమాండ్
, శుక్రవారం, 15 మార్చి 2019 (17:29 IST)
వైయస్ వివేకానంద రెడ్డి మరణం పలు అనుమానాలకు తావిస్తోందని వైకాపా నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించినప్పుడే... ఈ మహా కుట్రకు బీజం పడిందని ఆమె ఆరోపించడం జరిగింది. 
 
కడపను కొడతామనీ, పులివెందులను గెలుస్తామనీ తెదేపా నేతలు పదేపదే చెప్పారనీ, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి  ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగులో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని చెప్పారు.
 
వివేకానంద రెడ్డి మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరిన వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదనీ, అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిపోయి వచ్చిన యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం