Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రగిరి నియోజకవర్గంలో ఎదురులేని వైఎస్సార్సీపీ

Advertiesment
YSSRCP
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:00 IST)
చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తత్వం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ముక్కోటి సమీపంలోని నారాయణ గార్డెన్స్ లో పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యే చెవిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

రాష్ట్ర ప్రభుత్వం పట్ల, తాను చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 
 
తిరుచానూరు నుంచి..
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు వైఎస్సార్సీపీ లో చేరారు. దిలీప్ రాయల్, చంద్రశేఖర్ రాయల్, ఆచారి మహేష్, వాసు, మురళి తో దాదాపు 150 మంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతు బాధ్యతగా పని చేస్తామని స్పష్టం చేశారు. 
 
వెంకటపతి నగర్ లో..
తిరుపతి రూరల్ మండలం వెంకటపతి నగర్ లో ప్రతిపక్షం లేకుండా పోయింది. టీడీపీ నుంచి క్రియాశీలకంగా వ్యవహరించే పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి చిన్ని యాదవ్ ఆధ్వర్యంలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీ లోకి స్వాగతించారు.

పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఇతర నాయకులు నరసింహులు, సులోచన, బాలకృష్ణ, లక్ష్మీనారాయణ లతో పాటు 55 మంది నేతలు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలుష్య త‌నిఖీ వాహ‌నాల‌కు కూడా అనుమ‌తులు కావాల్సిందే