414 రోజులు ఇసిస్ చెరలో ఉన్నాం... ఆ పరిస్థితులు చెప్పలేను : ప్రొ.గోపికృష్ణ
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల వద్ద 414 రోజులు బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ సుఖాంతంగా ముగిసింది. వారిద్దరు రాత్రిపూట రహస్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల వద్ద 414 రోజులు బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ సుఖాంతంగా ముగిసింది. వారిద్దరు రాత్రిపూట రహస్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లను భారత విదేశాంగ శాఖ అధికారులు శనివారం ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్కు తీసుకువచ్చి ఇంట్లో వదిలివెళ్లారు.
దీనిపై గోపికృష్ణ స్పందిస్తూ తాము సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం చాలా ఆనందంగా ఉందన్నారు. తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. 414 రోజులు ఐఎస్ఐఎస్ చెరలో ఉన్నామని, తమను కిడ్నాప్ చేసినప్పటి నుంచి విడుదల చేసే వరకు జరిగిన పరిణామాలపై, అక్కడి పరిస్థితులపై సమాచారాన్నంతా భారత విదేశాంగ శాఖకు తాము ఇచ్చామని, ఇపుడు ప్రత్యేకించి చెప్పలేమన్నారు.