Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

414 రోజులు ఇసిస్ చెరలో ఉన్నాం... ఆ పరిస్థితులు చెప్పలేను : ప్రొ.గోపికృష్ణ

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల వద్ద 414 రోజులు బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ సుఖాంతంగా ముగిసింది. వారిద్దరు రాత్రిపూట రహస్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

414 రోజులు ఇసిస్ చెరలో ఉన్నాం... ఆ పరిస్థితులు చెప్పలేను : ప్రొ.గోపికృష్ణ
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:12 IST)
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల వద్ద 414 రోజులు బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ సుఖాంతంగా ముగిసింది. వారిద్దరు రాత్రిపూట రహస్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లను భార‌త విదేశాంగ శాఖ అధికారులు శనివారం ఉద‌యం తెల్ల‌వారుజామున హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇంట్లో వదిలివెళ్లారు. 
 
దీనిపై గోపికృష్ణ స్పందిస్తూ తాము సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం చాలా ఆనందంగా ఉందన్నారు. త‌న‌ కుటుంబాన్ని తిరిగి క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. 414 రోజులు ఐఎస్ఐఎస్‌ చెర‌లో ఉన్నామ‌ని, త‌మ‌ను కిడ్నాప్ చేసినప్ప‌టి నుంచి విడుద‌ల చేసే వ‌ర‌కు జ‌రిగిన పరిణామాల‌పై, అక్క‌డి ప‌రిస్థితుల‌పై స‌మాచారాన్నంతా భార‌త విదేశాంగ శాఖ‌కు తాము ఇచ్చామ‌ని, ఇపుడు ప్రత్యేకించి చెప్పలేమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ పాక్ కాదు.. అది టెర్రరిస్టుల కార్ఖానా : ముక్తార్ అబ్బాస్ నక్వీ