Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ పాక్ కాదు.. అది టెర్రరిస్టుల కార్ఖానా : ముక్తార్ అబ్బాస్ నక్వీ

పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ పాక్ కాదనీ, 'నా-పాక్, తీవ్రవాదుల కార్ఖానా అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ... తీవ్రవాదులతో సన్

పాకిస్థాన్ పాక్ కాదు.. అది టెర్రరిస్టుల కార్ఖానా : ముక్తార్ అబ్బాస్ నక్వీ
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:05 IST)
పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ పాక్ కాదనీ, 'నా-పాక్, తీవ్రవాదుల కార్ఖానా అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ... తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న పాకిస్థాన్ నేడు ప్రపంచానికే ముప్పుగా పరిణమించిందని నక్వీ ఆరోపించారు. ప్రధాన తీవ్రవాద గ్రూపులకు కేంద్రంగా పాకిస్థాన్ దేశం నిలిచిందన్నారు. 
 
తీవ్రవాదానికి మద్ధతు ఇస్తున్న పాకిస్థాన్ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిందని, ఆ దేశానికి ఎవరూ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆ దేశం తీవ్రవాదులకు ఆశ్రయమిస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే విషయం ప్రపంచానికి ఇప్పటికి తెలిసివచ్చిందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ చనిపోయేటట్టు ఉన్నాడని చెప్పడం వల్లే విభజన.. జైపాల్ మీరే నిజం చెప్పండి.. ఉండవల్లి