Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుల్లితెర నటిని లూటీ చేశారు... బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి...

హైదరాబాద్‌లో ఓ బుల్లితెర నటిని, ఆమె సోదరిని దోచుకున్నరారు. అదీ దౌర్జన్యం చేసి.. కత్తితో బెదిరించి.. వారి వద్ద వద్ద అన్ని వస్తువులను దోచుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... ధనశ్రీ అనే టీవీ ఆర్టిస్టు, ఆ

బుల్లితెర నటిని లూటీ చేశారు... బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి...
, ఆదివారం, 4 డిశెంబరు 2016 (15:31 IST)
హైదరాబాద్‌లో ఓ బుల్లితెర నటిని, ఆమె సోదరిని దోచుకున్నరారు. అదీ దౌర్జన్యం చేసి.. కత్తితో బెదిరించి.. వారి వద్ద వద్ద అన్ని వస్తువులను దోచుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... ధనశ్రీ అనే టీవీ ఆర్టిస్టు, ఆమె సోదరి శ్రీలత ఇటీవల బేగంపేట నుంచి తమ ఇంటికి స్కూటీపై వెళ్తుండగా.. యూసఫ్ గూడ వద్ద వారి వాహనం రాయి తగిలి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. 
 
ఆ సమంయలో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఇది చూసి వారిని తమ వాహనంపై ఇళ్ళకు చేరుస్తామని నమ్మబలికి వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని బెదిరించి వారి దగ్గరున్న బంగారు చైను, మొబైల్ ఫోన్ మొదలైనవాటిని తీసుకుని పారిపోయారు. 
 
అయితే బాధితురాళ్ళ ఫిర్యాదుతో పోలీసులు ఈ ముఠాలో ఐదుగురిని పట్టుకున్నారు. వీరిలో జి.వెంకటేష్ గౌడ్, సాయి సాగర్, కె.జగదీశ్ కుమార్లపై ఇదివరకే పోలీసు కేసులున్నాయని, పరారీలో ఉన్న మరో ఇద్దరినీ త్వరలో పట్టుకుంటామని బాలానగర్ పోలీసులు తెలిపారు. నిందితులు మాదన్నపేటకు చెందినవారని తెలిసింది. ఈ ముఠాలో జీహెచ్ఎంసిలో కాంట్రాక్టుపై పని చేస్తున్న శానిటరీ సూపర్ వైజర్, ఓ విద్యార్ధి కూడా ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త కరెన్సీ నోట్లు ఉంటే రూ.18 వేలకే తులం బంగారం... రూ.కోట్ల దోపిడీ