Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో తితిదే విజిలెన్స్ విభాగ అధికారి మృతి.. ముందు కరోనా ఆపై నెగెటివ్....

చెన్నైలో తితిదే విజిలెన్స్ విభాగ అధికారి మృతి.. ముందు కరోనా ఆపై నెగెటివ్....
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:37 IST)
చెన్నైలో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తితిదే అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజానికి ఈయన కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ విజిలెన్స్-సెక్యూరిటీ అధికారిగా వి.మహేశ్వరరావు పని చేస్తున్నారు. ఈయనకు కరోనా వైరస్ లక్షణాలతో గత జూలై నెల 28వ తేదీన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు నుంచి ఈయన కొంత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో రెండ్రోజుల కిందట నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ అని రావడంతో, ఆయన త్వరలోనే డిశ్చార్జి అయి, విధుల్లో చేరతారని టీటీడీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఆలయ వర్గాల్లో విషాదం నింపుతూ ఆ అధికారి మృతి చెందారు. మహేశ్వరరావు మృతిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చీఫ్ విజిలెన్స్-సెక్యూరిటీ ఆఫీసర్ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం: సీపీఐ