Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను... నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ: కేకే అసహనం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ

నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను... నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ: కేకే అసహనం
, శనివారం, 10 జూన్ 2017 (12:52 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ కోసిన మీడియా ప్రతినిధిపై కేకే అసహనం వ్యక్తం చేశారు. 
 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధిలోని దండుమైలారం గ్రామంలో 50 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని చెప్పారు. ఆ భూముల పత్రాలన్నీ చూసిన తరువాతే తాము కొనుగోలు చేశామని అన్నారు. అందుకు సంబంధించిన పత్రాలన్నీ చూసిన తరువాత, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు.
 
అయితే గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా? అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో.... 'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనీయులను గొంతుకోసి హత్య చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... డ్రాగన్ కంట్రీ కన్నెర్ర