Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేకవన్నె పులి.. నేనూ గిరిజనుడ్నే అంటూ ఇంట్లోకి పిలిచి...

హైదరాబాద్‌లో ఓ మేకవెన్నెపులిలా ఉన్న ఓ మృగాడి నిజస్వరూపం వెలుగుచూసింది. నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు ఇంట్లోకి రండి అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ర

మేకవన్నె పులి.. నేనూ గిరిజనుడ్నే అంటూ ఇంట్లోకి పిలిచి...
, సోమవారం, 9 అక్టోబరు 2017 (08:51 IST)
హైదరాబాద్‌లో ఓ మేకవెన్నెపులిలా ఉన్న ఓ మృగాడి నిజస్వరూపం వెలుగుచూసింది. నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు ఇంట్లోకి రండి అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెల్సిందే. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ (48) రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లిలో నివాసం ఉండే తమ కుమారుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో తమకు తెలిసిన వారివద్దకు వెళ్లి వస్తున్న సమయంలో వర్షం ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక ఇంటి పక్కన నిల్చుంది.
 
అయితే వర్షం ఆగకపోవడంతో సరైన చోటుకాకపోవడంతో ఆమె తడుస్తూనే ఉంది. దీంతో ఆమె నిల్చున్న ఇంట్లోంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరజన మహిళగా గుర్తించి, తాను కూడా గిరిజనుడ్నేనని చెబుతూ, వారి భాషలోనే మాట్లాడి, వర్షం తగ్గేవరకూ ఇంట్లో ఉండి వెళ్లాలని నమ్మించాడు. 
 
పైగా, గిరిజన భాషలో మాట్లాడటంతో ఆమె నిజంగానే నమ్మి ఇంట్లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన మేకవన్నెపులి కాసేపటి తన నిజస్వరూపం బయటపెట్టాడు. తర్వాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’.. అమిత్ షా తొత్తులు: వైశ్య నేతలపై ఐలయ్య