Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం

రేపు వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం
, బుధవారం, 21 జులై 2021 (19:34 IST)
ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు...పథకం వర్తించేలా అమలుచేస్తున్న ప్రభుత్వం. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడమంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతీ సమావేశంలోనూ చెబుతున్నారు, అదే ఆచరిస్తున్నారు. 
 
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందిస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
 
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 491.02 కోట్లు జమ, నేడు 3,27,244 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న రూ. 490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ది
 
గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే, కానీ శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 68,95,408 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 15 రెట్లు ఎక్కువగా రూ. 12,156.10 కోట్ల లబ్ది చేకూర్చింది
 
గత ప్రభుత్వం కాపులు బీసీలా, ఓసీలా అన్న అయోమయానికి గురిచేస్తూ , చట్టప్రకారం సబ్‌ కేటగిరైజేషన్‌ చేయకూడదని తెలిసినా సబ్‌ కేటగిరైజేషన్‌ చేయడం ద్వారా న్యాయ వివాదాలపాలు చేసి అల్పాదాయ వర్గాలకు ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు దక్కకుండా వదిలివేసిన పరిస్ధితిని చక్కదిద్ది, హమీ ఇచ్చి నెరవేర్చకుండా వదిలివేసిన ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు సైతం చిత్తశుద్దితో అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

దీని వల్ల ఏ రిజర్వేషన్‌ లేని పేద, అల్పాదాయ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు. ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్ల వల్ల కాపు వర్గాలకు లబ్ది చేకూరుస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జప్తు చేసిన వాహనాల క్లియరన్స్ కై గన్నవరం పోలీసుల చర్యలు