Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తోట త్రిమూర్తులు నాకు శత్రువే..పిల్లి సుభాష్

Advertiesment
తోట త్రిమూర్తులు నాకు శత్రువే..పిల్లి సుభాష్
, బుధవారం, 18 సెప్టెంబరు 2019 (21:08 IST)
తమ పార్టీలో చేరినా తోట త్రిమూర్తులు తనకెప్పుడూ శత్రువే అని తేల్చి చెప్పారు వైకాపా సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. త్రిమూర్తులుపై పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఆయన వాహన శ్రేణిని ఎస్సీలు అడ్డుకున్నారు. శిరోముండనం కేసుపై తోట త్రిమూర్తులును శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులను వైకాపాలో ఎందుకు చేర్చుకున్నారని నిలదీశారు. వారికి సమాధానం ఇచ్చిన పిల్లి సుభాష్..పార్టీలో చేరినా తోట త్రిమూర్తులు తనకెప్పుడూ శత్రువే అని తేల్చి చెప్పారు.

ఎస్సీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శిరోముండనం కేసు కోర్టులో ఉందని... బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు లారీల బంద్