Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్లు చెదిరే ధర పలికిన పుంగనూరు జాతి ఆవు

punganur cow
, సోమవారం, 25 జులై 2022 (12:24 IST)
చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కనిపించే పుంగనూరు జాతి ఆవు కళ్లు చెదిరే ధర పలికింది. ఇంత భారీ ధరను వెచ్చించి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ పశుపోషకుడి దగ్గరవుతున్న ఆవు ఏకంగా రూ.4.10 లక్షలకు అమ్ముడుపోయింది. మూడున్నరేళ్లు ఉన్న ఈ ఆవు ఎత్తు 30 అంగుళాలు మాత్రమే కావడం గమనార్హం. 
 
హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రయం నుంచి తెనాలి వచ్చిన ప్రతినిధులు పశుపోషకుడు కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. అంతకుముందు దానికి పశువైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించారు. ప్రత్యేకమైన ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుగల్ సురక్ష పాలసీ గురించి తెలుసా..?