Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మహిళతో 10 ఏళ్ల క్రితమే ఆ మ్యాటర్ సెటిలైంది, జనసేన నాయకుడు కిరణ్ రాయల్

Advertiesment
Kiran royal

ఐవీఆర్

, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (20:39 IST)
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మీడియా ముందుకు వచ్చారు. తనపై గత నాలుగు రోజులుగా వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషనుకు వచ్చినట్లు తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... '' గతంలో రోజా ఫిర్యాదుతో నాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా నా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో వున్న సమాచారాన్ని చోరీ చేసారు. ఇపుడా డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి నేను భయపడను. ఆమెతో ఏ వైసిపి నాయకుడు టచ్ లో వున్నాడో, ఎవరెవరు ఆమెతో మాట్లాడి వెనుక వుండి కథ నడిపిస్తున్నారో అంతా బైటకు తీస్తాను.
 
ఆర్థిక లావాదేవీలు ప్రతి ఒక్కరికి వుంటాయి. అలానే నాకూ వున్నాయి. ఐతే ఆ వ్యవహారం ఎప్పుడో పదేళ్ల క్రితమే సెటిలైపోయింది. ఇప్పుడు దాన్ని కొంతమంది వైసిపి పేటీఎంగాళ్లు లాగి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ మీవల్ల ఏమీకాదు. ఎందుకంటే నా ఫోన్లు హైకోర్టు దగ్గర వున్నాయి. కనుక నేను ఎవ్వరికీ భయపడేది లేదు.'' అంటూ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా... పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ దిగిన రైతు (video)