Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే పెట్టుబడులు రావడం లేదు: పురంధేశ్వరి

అందుకే పెట్టుబడులు రావడం లేదు: పురంధేశ్వరి
, బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:35 IST)
వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేక పోతున్నారన్నారు.

3 రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయన్నారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు.

మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నారు.. తొలి భేటీలోనే రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడులు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊర కుక్కల్లా టీడీపీ నేతలు..: వైసీపీ