Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ మంత్రి బొజ్జల కృష్ణారెడ్డిని క‌లిసిన తెలుగు మ‌హిళ ఉష‌

మాజీ మంత్రి బొజ్జల కృష్ణారెడ్డిని క‌లిసిన తెలుగు మ‌హిళ ఉష‌
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (15:17 IST)
మాజీ మంత్రి బొజ్జల కృష్ణారెడ్డిని క‌లిసిన తెలుగు మ‌హిళ చ‌క్రాల ఉష ప‌రామ‌ర్శించారు. ఆయ‌న‌కు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల, తిరుమల వెంకన్న స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిని వారి సతీమణి అమ్మగారైన బొజ్జల బృందమ్మని వారి స్వగృహంలో కలిసి వారు ఆయురారోగ్యాలతో ఉండాల‌ని కోరారు. 
 
 
శ్రీ కాళహస్తీశ్వరా స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలు అందజేసిన చక్రాల ఉష, మాట్లాడుతూ, నిరుద్యోగుల ఉపాధి కోసం ఎన్నో పరిశ్రమలు తెప్పించార‌ని, విద్యార్థిని విద్యార్థుల చదువు కోసం ఉన్నతమైన కాలేజీలు తీసుకరావడం, నియోజకవర్గ ప్రజల ఆరోగ్య దృష్ట్యా వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం,అమ్మగారైన బృందమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో డయాలసిస్ తీసురావడం, హాస్టల్ విద్యార్థుల భోజనాల్లో ప్రత్యేక శ్రద్ధ వ‌హించిన ఘనత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కుటుంబానికే దక్కుతుందని అన్నారు. గోపాల కృష్ణ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం నియోజకవర్గం ప్రశాంతం గా ఉండేదని, వారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో ఐటీ పంజా : అజిత్ పవార్ కుటుంబ ఆస్తుల జప్తు