Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేషన్ షాపులను కేసీఆర్ సర్కారు రద్దు చేస్తుందా? డీలర్ల అవినీతి చెక్ పెట్టేందుకేనా?

రేషన్ షాపులను తెలంగాణలోని కేసీఆర్ సర్కారు రద్దు చేయనుందని సమాచారం. రేషన్ షాపులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో రేషన

రేషన్ షాపులను కేసీఆర్ సర్కారు రద్దు చేస్తుందా? డీలర్ల అవినీతి చెక్ పెట్టేందుకేనా?
, ఆదివారం, 22 అక్టోబరు 2017 (11:42 IST)
రేషన్ షాపులను తెలంగాణలోని కేసీఆర్ సర్కారు రద్దు చేయనుందని సమాచారం. రేషన్ షాపులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో రేషన్ షాపుల రద్దు వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. 
 
శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరుగనున్నట్లు సమాచారం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అక్రమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం లబ్ధి దారులకు నేరుగా నగదు అందించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
 
నగదు నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల సర్కారుపై చెడ్డపేరు తొలగిపోతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.25 భారం భరిస్తోంది. రేషన్ షాపులు రద్దు చేస్తే, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి రూ.150 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంత మందికీ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పర్యవసానంగా కాస్త, అటూ ఇటుగా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు అందే అవకాశం ఉంది.
 
ప్రభుత్వ నిర్ణయం వల్ల డీలర్ల అవినీతికి చెక్ పడడంతోపాటు లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చిన బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. నగదు నేరుగా అందించడం వల్ల రేషన్ షాపుల ముందు పడిగాపులు కాసే అవస్థ తప్పుతుందని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దంలో యువతిని చూస్తూ హస్తప్రయోగానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్