Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవంత్‌ రెడ్డిని అలా కలవడం విరుద్ధం.. డీజీపీ సస్పెండ్

Revanth reddy
, ఆదివారం, 3 డిశెంబరు 2023 (19:03 IST)
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ శిబిరం సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
 
అయితే, ఫలితాలు వెలువడక ముందే పార్టీ అధ్యక్షుడిని డీజీపీ కలవడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని, దీంతో ఆయనను సస్పెండ్ చేశారని ఈసీ పేర్కొంది.
 
అంతకుముందు డీజీపీ అంజనీకుమార్, తెలంగాణ రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్ జైన్, మహేష్ భగవత్‌లు రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని మహేష్, సంజయ్ జైన్‌లకు ఈసీ నోటీసులు పంపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ ఇంట్లో పెళ్లి బాజాలు- షర్మిల కుమారుడి ప్రేమ వివాహం.. ఎప్పుడు?