Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అపుడు తప్పులు చేశాను.. అందుకే చిత్తుగా ఓడించారు.. నేతలతో చంద్రబాబు

ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని

అపుడు తప్పులు చేశాను.. అందుకే చిత్తుగా ఓడించారు.. నేతలతో చంద్రబాబు
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:14 IST)
ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని ఆయన గుర్తు చేశారు. 
 
ఆయన పార్టీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేద్దామన్న తొందర్లో గతంలో తాను కొన్ని తప్పులు చేశానని, వాటి కారణంగా ఓడిపోయానే తప్ప, మరే విధమైన కారణాలు, తనను ఓడించిన వ్యక్తులు లేరన్నారు. 
 
మరో 20 సంవత్సరాల పాటు ఏపీలో అధికారం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర, సమర్థ పాలన ఎక్కడ ఉంటే, పరిశ్రమలు అక్కడికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం తప్పని, ఈ తరహా అభిప్రాయం ఎవరికైనా ఉంటే మార్చుకోవాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారనున్న తెలంగాణ పొలిటికల్ ముఖచిత్రం : టీడీపీ - కాంగ్రెస్ దోస్తానా? చంద్రబాబు ఏమన్నారు?