Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధం : టీడీపీ ఎంపీ రాయపాటి

కిడ్నీదాత కోసం ఎదురు చూస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకు వచ్చారు. తాను మూత్రపిండం దానం చేస్తానని పేర్కొంటూ సుష్మా స్వరాజ

Advertiesment
TDP MP rayapati sambasiva rao
, శుక్రవారం, 18 నవంబరు 2016 (15:28 IST)
కిడ్నీదాత కోసం ఎదురు చూస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకు వచ్చారు. తాను మూత్రపిండం దానం చేస్తానని పేర్కొంటూ సుష్మా స్వరాజ్‌కు ఆయన లేఖ రాశారు.
 
గత కొన్ని రోజులుగా మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో సుష్మా స్వరాజ్ బాధపడుతున్న విషయం తెల్సిందే. తన మూత్రపిండాల పనితీరు మందగించిందని.. మార్పిడి చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని రెండు రోజుల క్రితమే ట్విట్టర్‌ ద్వారా ఆమె వెల్లడించారు.
 
పైపెచ్చు.. తాను మూత్రపిండం దాత కోసం ఎదురు చూస్తున్నానని, ప్రస్తుతం తాను డయాలసిస్‌పై మనగడ కొనసాగిస్తున్నాననీ, ఇకపై తనను ఆ కృష్ణభగవానుడే కాపాడాలంటూ ఆ ట్వీట్‌లో సుష్మా స్వరాజ్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా బిల్లు మనీ బిల్లు... ప్రొసీడింగ్స్ నుంచి తొలగింపు