Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్మోహన్ రెడ్డి పొగరుబోతు నేత.. రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జేసీ సోదరులు గత కొద్ది రోజు

Advertiesment
జగన్మోహన్ రెడ్డి పొగరుబోతు నేత.. రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు
, ఆదివారం, 19 మార్చి 2017 (16:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జేసీ సోదరులు గత కొద్ది రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై పదిమంది వరకు మృతి చెందారు. అప్పుడు జగన్ హడావుడి చేశారని, జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా జగన్మోహన్ రెడ్డి పొగరుబోతు నేత కావడంతోనే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారని జేసీ దివాకర్ నిప్పులు చెరిగారు. అలాగే రాష్ట్రంలోని రైతులకు సాగునీటిని అందిస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని తెలిపారు. 2018-19 ఏడాదికి జిల్లాలోని అన్ని గ్రామాలకు నీరందిస్తారని, అమరావతి - అనంతపురం హైవే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని జేసీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం.. విన్ డీజిల్‌లాగున్నారే?