Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా శవం కూడా చంద్రబాబుతోనే ఉంటుంది : బుద్ధా వెంకన్నా

Advertiesment
buddha
, బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:54 IST)
తాను పార్టీ మారబోతున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా క్లారిటీ ఇచ్చారు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తాను టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఉంటానని పునరుద్ఘాటించారు. వైకాపాకు చెందిన అల్లరి మూక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 
 
తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై బుద్ధా వెంకన్నా స్పందిస్తూ, తనకు పార్టీ మారాలాన్న ఆలోచన ఏదీ లేదన్నారు. కొందరు కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బతికివున్నంత వరకు టీడీపీతోనే ఉంటానని, చంద్రబాబుతోనే కలిసి పని చేస్తానని చెప్పి, తన గురించి సాగుతున్న పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. 
 
కాగా, ఇటీవల విజయాడలోని ఎన్.ఏ.సి. కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. పైగా వేదికపైకి వెళ్లొద్దంటూ వారు వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. అంతే, ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వచ్చేస్తుంది.. ఫీచర్లు ఇవేనా?