Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రకు ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రత్యేక హోదాతో రానివి కూడా ప్యాకేజీతో వస్తున్నాయంటూ పేర్కొన్నారు. 
 
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అడవినాయనచెరువు సమీపంలో జరిగిన తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిప్రతాప్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు వచ్చారు. పవన్ ప్రత్యేక హోదాపై చేస్తున్న ప్రయత్నంపై సాయిప్రతాప్ స్పందించాలని వారు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. పనిలోపనిగా చిరంజీవిపైనా సెటైర్లు వేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఏమైందో తెలుసుగా అంటూ చురకలు వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెధవల్లారా.. నదిలో మునిగిపోతున్న నా భార్యను ఎందుకు కాపాడార్రా : ఈతగాళ్ళపై భర్త ఫైర్