Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవినేని నెహ్రూ కన్నుమూత : బోరునవిలపించిన నందమూరి హరికృష్ణ

టీడీపీ నేత దేవినేని నెహ్రూ మరణవార్తవిని నందమూరి హరికృష్ణ బోరునవిలపించారు. సోమవారం ఉదయం దేవినేని నెహ్రూ గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న నందమూరి హరికృష్ణ హుటాహుటిన కేర్ ఆసుపత్ర

దేవినేని నెహ్రూ కన్నుమూత : బోరునవిలపించిన నందమూరి హరికృష్ణ
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (10:13 IST)
టీడీపీ నేత దేవినేని నెహ్రూ మరణవార్తవిని నందమూరి హరికృష్ణ బోరునవిలపించారు. సోమవారం ఉదయం దేవినేని నెహ్రూ గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న నందమూరి హరికృష్ణ హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. దేవినేని భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టారు.
 
ఎన్టీఆర్ హయాం నుంచే తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన దేవినేని నెహ్రూ ఆ సమయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెజవాడ రాజకీయాల్లో దనదైన ముద్రవేశారు. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణతో దేవినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ స్వయంగా కేర్ ఆసుపత్రికి వచ్చి దేవినేని భౌతికకాయాన్ని సందర్శించారు. 
 
అలాగే, దేవినేని నెహ్రూ మరణంతో బెజవాడలోని ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలుసుకున్న నెహ్రూ అనుచరులు, కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ దేవినేని మృతిపై స్పందించారు. దేవినేని నెహ్రూ మరణ వార్త విని ఎలా స్పందించాలో అర్థం కాలేదని, నోట మాట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నెహ్రూ మృతి తనను తీవ్రంగా బాధించిందని, వ్యక్తిగతంగా ఇది తనకు తీరనిలోటని ఆవేదన చెందారు. నెహ్రూ రాజకీయ గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బుద్దప్రసాద్ అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికే లంచం... టీటీవీ దినకరన్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ కేసు