Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొంగోడికి ఓట్లు వేసి భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాం : చింతకాయల

Chintakayala Ayyanna Patrudu
, ఆదివారం, 29 మే 2022 (12:23 IST)
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుని 17 నెలల పాటు జైల్లో ఉన్న ఒక దొంగోడికి ఓట్లు వేసి అమరాతితో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాతుడు ధ్వజమెత్తారు. 
 
ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ, మహానాడులో చేసిన తీర్మానాలు చూసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం ఈ వేదికను వల్లకాడు, శ్మశానం అన్నారని, ఈ మాటలను ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
రాబోయే ఎన్నికల్లో నీతో పాటు నీ పార్టీ వైకాపాను, జగన్‌ను అదే శ్మశానంలో ప్రజలు తగలబెడుతారని, గుర్తుంచుకో.. అరగంట గంట అంటూ రాత్రిపూట పూట మల్లెపూలు అమ్ముకునే అంబటి రాంబాను లాంటో మంత్రా? 
 
బూతులు మాట్లాడే రింగుల రాణి రోజా ఆంటీ మొగుడికి చీరకట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె తెలుగుదేశం పార్టీ నేతలకు చీరలు పంపుతుందట. రాజకీయాలు అంటే జబర్దస్త్ అనుకుంటోందా? అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట - 31 మంది మృత్యువాత